సునంద మృతి కేసు.. శశిథరూర్ కు హైకోర్టు నోటీసులు
- శశిథరూర్ కు 2021లో క్లీన్ చిట్ ఇచ్చిన పటియాలా హౌస్ కోర్టు
- కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన పోలీసులు
- పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు
ఈ క్రమంలో ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు... 2021 ఆగస్టులో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసి, ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే, పటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో పోలీసులు సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు థరూర్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2023 ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.