సర్పంచులు ఐక్యంగా చేస్తున్న పోరాటంలో తప్పేముంది?: చంద్రబాబు
- తిరుపతిలో సర్పంచుల శంఖారావం
- పోలీసులు భగ్నం చేశారన్న చంద్రబాబు
- అక్రమ అరెస్ట్ లను ఖండిస్తున్నానని వెల్లడి
- సర్పంచుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నట్టు వివరణ
గ్రామాల అభివృద్ధిని జగన్ రెడ్డి పట్టించుకోకుండా రూ.8,660 కోట్ల నిధులను దారిమళ్లించారని చంద్రబాబు ఆరోపించారు. కాబట్టే సర్పంచులంతా రోడ్కెక్కారని అన్నారు. ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్న సర్పంచుల పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు వివరించారు. ప్రభుత్వం సర్పంచుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చంద్రబాబు స్పష్టం చేశారు.