వైఎస్ వివేకా హత్య కేసులో సాక్ష్యాలను చెరిపేసిన ఆధారాలు ఉన్నాయి: సుప్రీంకోర్టు
- వివేకా హత్య కేసు విచారణను హైదరాబాద్ కు బదిలీ చేసిన సుప్రీంకోర్టు
- విచారణపై వివేకా కుమార్తెకు అసంతృప్తి ఉందన్న సుప్రీం
- ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకున్నామని వ్యాఖ్య
ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణపై వివేకా కుమార్తెకు అసంతృప్తి ఉన్నందున కేసు విచారణ బదిలీకి ఆదేశాలిస్తున్నట్టు తెలిపింది. ప్రజల ప్రాథమిక హక్కులను తాము పరిగణనలోకి తీసుకున్నామని చెప్పింది. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను చెరిపేసిన ఆధారాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమని చెప్పింది.