Alllari Naresh: ప్రీ రిలీజ్ ఈవెంటుకి రెడీగా అల్లరి నరేశ్ సినిమా!

  • అల్లరి నరేశ్ హీరోగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'
  • మారేడుమిల్లి నేపథ్యంలో నడిచే కథ 
  • కథానాయికగా అలరించనున్న ఆనంది
  • పార్క్ హయత్ లో రేపు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్  
  • ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల  
 Itlu Maredumilly Prajaneekam Movie Update

హాస్య కథానాయకుడిగా 50 సినిమాలకి పైగా చేసిన అల్లరి నరేశ్, ఇక విభిన్నమైన పాత్రల ద్వారా ప్రేక్షకులను మెప్పించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చిన సినిమానే 'నాంది'. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, అలాగే మరో కొత్త పాయింటుతో నడిచే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాను చేశాడు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి డేట్ ఖరారు చేసుకున్నారు. ఈ నెల 20వ తేదీన హైదరాబాదులోని 'పార్క్ హయత్'లో ఈ వేడుకను ప్లాన్ చేశారు. ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. చీఫ్ గెస్టు ఎవరనేది మాత్రం ఇంకా చెప్పలేదు. 

హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండ నిర్మించిన ఈ సినిమాకి, ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆనంది అలరించనుంది. తెలుగు నుంచి కోలీవుడ్ వెళ్లి అక్కడ హీరోయిన్ గా బిజీ అయిన ఆనంది, ఈ మధ్య కాలంలో ఇక్కడ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మారేడుమిల్లి నేపథ్యంలో నడిచే ఈ కథ, అల్లరి నరేశ్ కి మరో హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

More Telugu News