Road Accident: ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 12 మంది దుర్మరణం

  • జోషి మఠ్ ప్రాంతంలో ఘటన
  • లోయలో పడిపోయిన వాహనం
  • మృతుల్లో ఇద్దరు మహిళలు
  • ముగ్గురికి గాయాలు
Fatal road accident in Uttarakhand as 12 dies

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చమోలీ జిల్లా జోషి మఠ్ ప్రాంతంలో ఓ వాహనం రోడ్డు పక్కన లోయలోకి పడిన దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. 

ఉర్గాం-పల్లా జకోలా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంది.

More Telugu News