D Arvind: టీఆర్ఎస్ గూండాలు బీభత్సం సృష్టించారు.. మా అమ్మను బెదిరించారు: ధర్మపురి అర్వింద్

  • హైదరాబాద్ లోని అర్వింద్ ఇంటిపై దాడి
  • కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతో జరిగిందన్న అర్వింద్
  • వస్తువులను పగులగొడుతూ, బీభత్సం సృష్టించారన్న ఎంపీ
TRS goons terrorised my mother says D Arvind

బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. దాదాపు 100 మంది వరకు ఈ దాడిలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని పెంచింది. మరోవైపు ఈ ఘటనపై అర్వింద్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే హైదరాబాద్ లోని తన ఇంటిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని అన్నారు. ఇంట్లోని వస్తువులను పగులగొడుతూ, బీభత్సం సృష్టిస్తూ, తన తల్లిని బెదిరించారని చెప్పారు. అంతేకాదు, ఈ ట్వీట్ ను ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాని కార్యాలయానికి ట్యాగ్ చేశారు. దాడికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.

More Telugu News