compact electric vehicle: 16న విడుదల అవుతున్న బుల్లి ఎలక్ట్రిక్ కారు

  • ఈజ్ -ఈ పేరుతో సూక్ష్మ ఎలక్ట్రిక్ కారు
  • ధర మాత్రం రూ.4-5 లక్షల స్థాయిలో
  • వ్యక్తిగత రవాణా వాహనంగా తీసుకొస్తున్న ముంబై కంపెనీ
This This compact electric vehicle will launch in the Indian market on 16th November will launch in the Indian market on 16th November

టాటా నానో కారు గుర్తుందా..? ‘చిన్న కారు, చౌక కారు’ పేరుతో వచ్చి కనుమరుగైపోయింది. ఇప్పుడు నానో కంటే చిన్న కారు వస్తోంది. కాకపోతే ఎలక్ట్రిక్ రూపంలో. ముంబైకి చెందిన పీఎంవీ ఎలక్ట్రిక్ ఈ నెల 16న మైక్రో ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీనికి ఈఏఎస్-ఈ (ఈజ్- ఈ) అని పేరు పెట్టింది. ప్రతి రోజూ ఉపయోగించుకోతగ్గ కారుగా దీన్ని అభివర్ణించింది. 

పీఎంవీ ఎలక్ట్రిక్ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు ఇది. దీని ధర రూ.4-5 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ బుల్లి ఎలక్ట్రిక్ (మైక్రో ఎలక్ట్రిక్) కారు ప్రొటో టైప్ సిద్ధమైందని, త్వరలోనే ఉత్పత్తి మొదలు పెట్టాల్సి ఉందని పీఎంవీ ఎలక్ట్రిక్ తెలిపింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తాము ఈ కారును అభివృద్ధి చేశామని పీఎంవీ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు కల్పిత్ పటేల్ తెలిపారు. పర్సనల్ మొబిలిటీ (వ్యక్తిగత రవాణా) పేరిట ఓ కొత్త విభాగాన్ని పరిచయం చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈజ్-ఈ కారు ఒక్కసారి చార్జ్ చేస్తే 120-200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. నాలుగు గంటల్లో బ్యాటరీ చార్జ్ అవుతుంది. 

More Telugu News