అరెస్టయిన జనసేన నేతలను ఘనంగా సన్మానించిన పవన్ కల్యాణ్
- పీఏసీ సమావేశం కోసం మంగళగిరి వచ్చిన పవన్
- ఇటీవలే అరెస్టై విడుదలైన నేతల ఫ్యామిలీలతో ఆత్మీయ సమావేశం
- కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా
శనివారం నాటి సమావేశానికి అరెస్టై విడుదలైన నేతలతో పాటు వారి కుటుంబ సభ్యులను పార్టీ అధిష్ఠానం మంగళగిరి రప్పించింది. వారితోనే పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అరెస్టై విడుదలైన 9 మంది నేతలకు శాలువాలను కప్పి పవన్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఒక్కొక్క నేతతో ప్రత్యేకంగా మాట్లాడిన పవన్... అరెస్ట్ సందర్భంగా వారు ఎదుర్కొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులోనూ ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు.