Andhra Pradesh: టీడీపీ నేత కుమార్తె కిడ్నీ ఆపరేషన్ కు సేకరించిన రూ.15 లక్షలు అందించిన నారా లోకేశ్

nara lokesh handed over 15 lack rupees cheque to tdp leaders daughter operation
  • కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన టీడీపీ కార్యకర్త కుమార్తెకు కిడ్నీ సంబంధిత వ్యాధి
  • ఆపరేషన్ కు రూ.15 లక్షలు అవసరమన్న వైద్యులు
  • విషయం తెలిసి నిధుల సేకరణ ప్రారంభించిన కోమటి జయరామ్
  • టీడీపీ ఎన్నారై అమెరికా విభాగానికి చెందిన సభ్యుల సహకారంతో రూ.15 లక్షల సేకరణ
  • నారా లోకేశ్ ద్వారా నిధులను బాధిత కుటుంబానికి అందించిన ఎన్నారై విభాగం
కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ టీడీపీ నేత కుమార్తెకు ఆపరేషన్ కు అవసరమైన రూ.15 లక్షలను ఆ పార్టీ అగ్ర నేత నారా లోకేశ్ అందజేశారు. ఈ మేరకు శుక్రవారం రూ.15 లక్షల చెక్కును బాలిక తండ్రి గాజుల మురళీకృష్ణకు ఆయన అందజేశారు. ఈ మొత్తాన్ని టీడీపీ ఎన్నారై అమెరికా విభాగం సేకరించింది. ఆ మొత్తాన్నే నారా లోకేశ్ బాధిత కుటుంబానికి అందజేశారు. 

కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ నేత మురళీకృష్ణ కుమార్తె గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వైద్యులకు చూపించగా...బాలికకు ఆపరేషన్ చేయాలని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎన్నారై అమెరికా విభాగానికి చెందిన కీలక నేత కోమటి జయరామ్ నిధుల సేకరణకు పూనుకున్నారు. టీడీపీ ఎన్నారై అమెరికా విభాగానికి చెందిన సభ్యుల సహకారంతో బాలిక ఆపరేషన్ కు అవసరమైన రూ.15 లక్షలను ఆయన సేకరించారు. ఈ నిధులను నారా లోకేశ్ ద్వారా టీడీపీ ఎన్నారై అమెరికా విభాగం బాధిత బాలికకు అందజేసింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో టీడీపీ ఎన్నారై అమెరికా విభాగం ముందుంటుందని లోకేశ్ అభినందించారు.
Andhra Pradesh
TDP
Krishna District
Avanigadda
Nara Lokesh
NRI TDP USA
Komati Jayaram

More Telugu News