Kantara: 'కాంతార' ఘనవిజయం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం

  • రిషబ్ శెట్టి నటుడిగా, దర్శకుడిగా విశ్వరూపం
  • కాంతార బ్లాక్ బస్టర్ హిట్
  • ఊహించని రీతిలో పాన్ ఇండియా క్రేజ్
  • వృద్ధ దైవ నర్తకులకు అలవెన్స్ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం
Karnataka govt decides to give allowance to Daiva Nartakas after Kantara success

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కన్నడ చిత్రం కాంతార. ఇప్పుడీ సినిమా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటోంది. నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి ఫుల్ మార్కులు సొంతం చేసుకున్నారు. 

ఈ చిత్రంలో, ఆత్మలను సంతృప్తి పరిచేలా సాగే 'భూత కోల' అనే ప్రాచీన నృత్యాన్ని కూడా చూపించారు. ఇందులో నర్తించేవారిని దైవ నర్తకులు అంటారు. కాంతార చిత్రం చివర్లో రిషబ్ శెట్టి దైవ నర్తకుడిగా విశ్వరూపం ప్రదర్శించారు. ఓవరాల్ గా ఈ సినిమా అనేక వర్గాలను అలరిస్తూ బ్లాక్ బస్టర్ హిట్టయింది. 

ఈ నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వయసు పైబడిన దైవ నర్తకులకు నెలవారీ భత్యం అందిస్తామని అధికారికంగా ప్రకటించింది. 60 ఏళ్లకు పైబడిన దైవ నర్తకులకు నెలకు రూ.2,000 చొప్పున అందిస్తామని వెల్లడించింది. ఈ విషయాలను బీజేపీ ఎంపీ పీసీ మోహన్ వెల్లడించారు.

More Telugu News