బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం
- 22న వాయుగుండంగా మారి ఆపై తుపానుగా రూపాంతరం చెందే అవకాశం
- ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
- కోస్తా, రాయలసీమలో నేడు, రేపు వర్షాలు
- గతరాత్రి విజయవాడలో భారీ వర్షం
కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సముద్ర తీరంలో రేపు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 21, 22 తేదీల్లో 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి జాలర్లు వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. కాగా, గతరాత్రి విజయవాడలో కురిసిన భారీ వర్షానికి నగరం జలమయం అయింది.