వైసీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: బాలకృష్ణ
- హిందూపురంలో వరదలు
- బాలకృష్ణ పర్యటన
- కబ్జాలు, ఆక్రమణలు పెరిగిపోయాయన్న బాలయ్య
- అందుకే హిందూపురం వాసులకు వరద కష్టాలు అని వెల్లడి
వైసీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బాలకృష్ణ అన్నారు. భూ కబ్జాలు, ఆక్రమణలు పెరిగిపోవడం వల్లే హిందూపురం వాసులకు వరద కష్టాలు అని వెల్లడించారు.
బాలయ్య తన పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. త్యాగరాజనగర్, చౌడేశ్వరి కాలనీ, ఆర్టీసీ కాలనీల్లో వరద బాధితులకు ఆహారం, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు.
అంతేకాదు, తన అభిమానుల సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు గౌస్ మొహిద్దీన్ కుమార్తె వివాహానికి కూడా బాలకృష్ణ హాజరయ్యారు. వధూవరులకు ఆశీస్సులు అందజేశారు.