పాకిస్థాన్లో విషాదం: వరద బాధితుల బస్సుకు మంటలు.. 18 మంది సజీవ దహనం
- పునరావాస కేంద్రం నుంచి స్వస్థలాలకు బయలుదేరిన వరద బాధితులు
- బస్సు వెనక భాగంలో అంటుకున్న మంటలు
- ప్రమాద సమయంలో బస్సులో 35 మంది
- మరో 10 మందికి తీవ్ర గాయాలు
ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారని, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా, పాకిస్థాన్లో ఇటీవల సంభవించిన వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఆ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా వానలు కురిసి బీభత్సం సృష్టించాయి. దేశంలో దాదాపు సగం భూభాగం వరదల్లో చిక్కుకుంది. అందులో సింధ్ ప్రావిన్సులోని దాదు జిల్లా కూడా ఉంది. తాజా ప్రమాదంలో మరణించిన వారు ఈ జిల్లాకు చెందిన వారే. కాగా, ఆగస్టులో పంజాబ్ ప్రావిన్సులో ఆయిల్ ట్యాంకర్, బస్సు ఢీకొన్న ఘటనలో 20 మంది సజీవ దహనమయ్యారు.