ఆసియా కప్ సెమీస్.. థాయ్లాండ్కు 149 పరుగుల లక్ష్యం ఇచ్చిన భారత్
- టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్
- 20 ఓవర్లలో 148/6 స్కోరు
- రాణించిన షెఫాలీ, హర్మన్, జెమీమా
మరో ఓపెనర్ స్మృతి మంధాన (13), రిచా ఘోష్ (2), దీప్తి శర్మ (3) తదితరులు నిరాశ పరిచినా.. జెమీమా రోడ్రిగ్స్ (27 బంతుల్లో 3 ఫోర్లతో 27), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 4 ఫోర్లతో 36) రాణించారు. చివర్లో పూజా వస్త్రాకర్ (13 బంతుల్లో 1 సిక్స్ తో 17 నాటౌట్) మెరుపులు మెరిపించింది. థాయ్ లాండ్ బౌలర్లలో సిర్నారిన్ తిపోచ్ (3/24) మూడు వికెట్లతో సత్తా చాటింది. కాగా, ఈ మధ్యాహ్నం జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు పోటీ పడతాయి.