Andhra Pradesh: ఏపీ సీఎం జ‌గ‌న్‌తో అమెరికా కాన్సులేట్ జ‌న‌ర‌ల్ భేటీ... క‌రోనాను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నార‌ని కితాబు

  • ఇటీవ‌లే హైద‌రాబాద్‌లోని అమెరికా రాయ‌బార కార్యాల‌యంలో బాధ్య‌త‌లు చేప‌ట్టిన జెన్నిఫ‌ర్‌
  • తాడేప‌ల్లి వెళ్లి జ‌గ‌న్‌తో భేటీ అయిన వైనం
  • జీడీపీలో రాష్ట్రాన్ని నెంబ‌ర్ వ‌న్‌గా నిలిపారంటూ జ‌గ‌న్‌కు కితాబు
  • ఏపీలో పెట్టుబ‌డుల‌కు స‌హ‌క‌రించాల‌ని జెన్నిఫ‌ర్‌కు జ‌గ‌న్ విన‌తి
 US Consulate General Jennifer Larson metts ap cm ys jagan

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో అమెరికా కాన్సులేట్ జ‌న‌ర‌ల్ జెన్నిఫ‌ర్ లార్సన్ భేటీ అయ్యారు. బుధ‌వారం తాడేప‌ల్లి వ‌చ్చిన జెన్నిఫ‌ర్ సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వారి మ‌ధ్య ప‌లు అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింది. క‌రోనాను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నారంటూ జ‌గ‌న్‌ను జెన్నిఫ‌ర్ అభినందించారు. అంతేకాకుండా జీడీపీ వృద్ధిలో నెంబ‌ర్ వ‌న్‌గా ఏపీని నిల‌బెట్టార‌ని కూడా ఆమె జ‌గ‌న్‌కు కితాబిచ్చారు.

రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌కు స‌హ‌కారం అందించాల‌ని ఈ సందర్భంగా జెన్నిఫ‌ర్‌ను జ‌గ‌న్ కోరారు. రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను ఆయ‌న వివ‌రించారు. హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేసే అమెరికా రాయ‌బార కార్యాల‌యం చీఫ్‌గా ఇటీవలే జెన్నిఫ‌ర్ నియ‌మితుల‌య్యారు. తెలంగాణ‌తో పాటు ఏపీ, ఒడిశాలకు సంబంధించిన అమెరికా వ్య‌వ‌హారాల‌ను ఆమె ప‌ర్యవేక్షించనున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె జ‌గ‌న్‌తో ప‌రిచ‌యం కోసం ఆయ‌న‌తో భేటీ అయ్యారు.

More Telugu News