Team India: సిరీస్ ఫలితం తేల్చనున్న మూడో వన్డే... టాస్ గెలిచిన టీమిండియా

  • ఢిల్లీలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • మార్పుల్లేకుండా బరిలో దిగుతున్న టీమిండియా
  • దక్షిణాఫ్రికా జట్టుకు మిల్లర్ నాయకత్వం
Team India won the toss in third ODI

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు మూడో వన్డే జరగనుంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్ లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమవుజ్జీగా నిలిచాయి. ఈ నేపథ్యంలో, నేటి మ్యాచ్ సిరీస్ ఫలితం తేల్చనుంది. దాంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు చేయలేదని కెప్టెన్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. అటు, టెంబా బవుమా గైర్హాజరీలో దక్షిణాఫ్రికా జట్టుకు సీనియర్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ నాయకత్వం వహిస్తున్నాడు.

More Telugu News