టీమిండియా బ్యాటింగ్ చేస్తుంటే మైదానంలోకి వచ్చిన పాము... మ్యాచ్ కు అంతరాయం
- గువాహటిలో ఘటన
- పామును గుర్తించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు
- వెంటనే స్పందించిన మైదానం సిబ్బంది
- తిరిగి కొనసాగిన ఆట
దీనిపై వెంటనే స్పందించిన మైదానం సిబ్బంది తగిన పరికరాలతో గ్రౌండ్ లోకి వచ్చి పామును చాకచక్యంగా పట్టుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అప్పటికి టీమిండియా 7 ఓవర్లలో 68 పరుగులతో ఆడుతోంది.
కాగా, దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేసే సమయంలోనూ మ్యాచ్ నిలిచిపోయింది. ఫ్లడ్ లైట్లలో ఒక టవర్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో మైదానంలో తగినంత వెలుగు కనిపించలేదు. కాసేపటి తర్వాత ఆ టవర్ ను పునరుద్ధరించడంతో మ్యాచ్ కొనసాగింది.