ముంబయిలో రూ.1476 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
- విదేశీ కమలా ఫలాల బాక్సుల్లో డ్రగ్స్ అక్రమ రవాణా
- 207 కిలోల హై ప్యూరిటీ డ్రగ్స్ స్వాధీనం
- డ్రగ్స్ దిగుమతిదారును అరెస్ట్ చేసిన డీఆర్ఐ
- డ్రగ్స్ దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్టు అనుమానం
కాగా, ఈ హై ప్యూరిటీ డ్రగ్స్ తీసుకున్నవారికి ఆ మత్తు 12 గంటల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రగ్స్ ను దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు అక్రమ రవాణా చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ డ్రగ్స్ ను దిగుమతి చేసుకున్న వ్యక్తిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన కస్టమ్స్ హౌస్ ఏజెంట్ కోసం, స్థానిక మాదకద్రవ్యాల నెట్ వర్క్ సభ్యుల కోసం గాలిస్తున్నారు.