Mahesh Babu: మహేశ్ మూవీ టైటిల్ దాదాపు అదేనట!

  • త్రివిక్రమ్ తో సెట్స్ పైకి వెళ్లిన మహేశ్ బాబు 
  • దసరా తరువాత సెకండ్ షెడ్యూల్ మొదలు
  • కథానాయికగా పూజ హెగ్డే
  • టైటిల్ గా 'అయోధ్యలో అర్జునుడు' ఖరారైనట్టే  
Ayodhyalo Arjunudu Movie Update

మహేశ్ బాబు 28వ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక -  హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా, ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా ఇది. ఫస్టు షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను దసరా తరువాత ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. 

ఈ సినిమాను ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి, అభిమానులంతా టైటిల్ విషయంలో ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. త్రివిక్రమ్ కి సినిమా టైటిల్స్ విషయంలో 'అ' సెంటిమెంట్ ఉంది. 'అరవింద సమేత' .. 'అల వైకుంఠపురములో' సినిమాల తరువాత ఆయన చేస్తున్న ఈ సినిమా టైటిల్ కూడా 'అ' తోనే మొదలవుతుందని అంటున్నారు. 

కథను బట్టి ఈ సినిమాలో 'అయోథ్యలో అర్జునుడు' అనే టైటిల్ ను సెట్ చేసినట్టుగా తెలుస్తోంది. విజయదశమి రోజున ఈ టైటిల్ ను ప్రకటించనున్నట్టు చెబుతున్నారు. దాదాపు ఈ టైటిల్ ఖరారైనట్టేనని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. ఆమెకి ఈ ఇద్దరితోను హిట్లు ఉండటం అంచనాలు పెరగడానికి మరో కారణమవుతోంది.

More Telugu News