మహారాష్ట్రలో రాజకీయ దుమారం.. సీఎం ఏక్నాథ్ షిండే కుర్చీలో కూర్చున్న తనయుడు
- సీఎం కుమారుడి చేతిలో ఫైల్
- ‘సూపర్ సీఎం’ అని విమర్శిస్తున్న విపక్షాలు
- విమర్శలపై స్పందించిన శ్రీకాంత్ షిండే
- అది సీఎం అధికారిక నివాసం కాదని స్పష్టీకరణ
ఈ విమర్శలపై శ్రీకాంత్ షిండే స్పందించారు. ముఖ్యమంత్రి రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నారని అన్నారు. ఆయన చాలా సమర్థుడైన సీఎం అని, ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో థానే నివాసంలోనిదని, అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం కాదని వివరణ ఇచ్చారు. సీఎంతోపాటు తాను కూడా దానిని ఉపయోగించుకుంటూ ఉంటానని శ్రీకాంత్ స్పష్టం చేశారు.