Nagarjuna: కర్నూల్ వేదికగా 'ది ఘోస్ట్' ప్రీ రిలీజ్ ఈవెంట్!

  • నాగార్జున హీరోగా రూపొందిన 'ది ఘోస్ట్'
  • కథానాయికగా అలరించనున్న సోనాల్ చౌహన్ 
  • ఈ నెల 23వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • అక్టోబర్ 5వ తేదీన సినిమా విడుదల
The Ghost movie update

నాగార్జున కథానాయకుడిగా 'ది ఘోస్ట్' సినిమా రూపొందింది. సునీల్ నారంగ్ .. శరత్ మరార్ .. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ ఈవెంట్ కి 'కర్నూల్' వేదిక కానుంది. అక్కడి ఎస్.టి.బి.సి కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ  ఫంక్షన్ ను నిర్వహించనున్నారు. ఆ రోజున నాగచైతన్య - అఖిల్ ఇద్దరూ కూడా ఈ వేడుకకి హాజరు కానున్న విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ ను వదిలారు.

నాగార్జున సరసన నాయికగా సోనాల్ చౌహన్ నటించిన ఈ సినిమాలో, సురేంద్రన్ ..  రవి వర్మ ..  శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ  సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. 'గరుడ వేగ' తరువాత ప్రవీణ్ సత్తారు నుంచి వస్తున్న సినిమా కావడంతో, అందరిలోను ఆసక్తి ఉంది.

More Telugu News