ఢిల్లీ, నోయిడాను ముంచెత్తిన వర్షాలు
- రెండు రోజులుగా వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
- రోడ్లపై నీళ్లు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్
- నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
వర్షాల నేపథ్యంలో శుక్రవారం నోయిడా, గురుగ్రామ్ నగరాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. హర్యానాలో ప్రభుత్వ విపత్తు నిర్వహణ అథారిటీ..గుర్గావ్లోని కార్యాలయాలు, కార్పొరేట్లను శుక్రవారం ఇంటి నుంచి పని చేయమని ఉద్యోగులను కోరుతూ నోటీసును విడుదల చేసింది. ఢిల్లీలో పాఠశాలలకు సెలవుపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, చాలా ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇచ్చినట్టు తల్లిదండ్రులకు సందేశాలు వచ్చాయి. గుర్గావ్, ఫరీదాబాద్ జిల్లాల్లోనూ ఇదే విధంగా పలు ప్రైవేట్ పాఠశాలలు సెలవు ప్రకటించాయి.