తెలంగాణలో తాజాగా 71 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 7,007 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 47 మందికి పాజిటివ్
- కరోనా నుంచి కోలుకున్న 88 మంది
- ఇంకా 751 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 8,36,692 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,31,830 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 751 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
