FIFA Under-17 Wordl Cup: ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్ కప్ నిర్వహణ హామీలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

  • భారత్ లో ఫిఫా మెగా ఈవెంట్
  • అక్టోబరు 11 నుంచి వరల్డ్ కప్
  • ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
  • వరల్డ్ కప్ అంశాలపై చర్చ
Union govt approves signing of guarantees to organize  FIFA Inder 17 womens world cup in India

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. భారత్ లో ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్ కప్ నిర్వహణకు సంబంధించిన పూచీకత్తుల ఫైలుపై సంతకం చేసేందుకు క్యాబినెట్ ఆమోదించిందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ మెగా టోర్నీ అక్టోబరు 11 నుంచి 30వ తేదీ వరకు జరగనుందని తెలిపారు. 

  ఫిఫా మహిళల అండర్-17 వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యమిస్తుండడం ఇదే ప్రథమం. ఈ భారీ టోర్నీ నిర్వహణ కోసం కేంద్రం ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ కు రూ.10 కోట్ల సాయం అందిస్తోంది. ఆట మైదానం, స్టేడియంలో విద్యుచ్ఛక్తి, ఇంధనం తదితర అవసరాల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. 

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తో క్రీడలకు నిధులు పెంచామని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ ద్వారా మోదీ సర్కారు క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని వివరించారు.

More Telugu News