TDP: టీడీపీ యువ నేత హుందాతనం... వైసీపీకి సారీ చెప్పిన జీవీ రెడ్డి

  • పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌లో ఏపీ తొలి స్థానంలో ఉంద‌న్న వైసీపీ
  • తొలి స్థానంలో క‌ర్ణాట‌క‌, ఆ త‌ర్వాత గుజ‌రాత్ ఉన్నాయ‌న్న జీవీ రెడ్డి
  • దొర్లిన పొర‌పాటును స‌రిదిద్దుతూ రెండో ట్వీట్ చేసిన టీడీపీ యువ నేత‌
  • ఇదే విష‌యాన్ని వివ‌రిస్తూ వైసీపీకి సారీ చెప్పిన వైనం
tdp leader gv reddy says sorry to ysrcp

టీడీపీ యువ నేత జీవీ రెడ్డి తన హుందాతనాన్ని ప్రదర్శించారు. అధికార పార్టీ వైసీపీకి ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా సారీ చెప్పారు. ఈ మేర‌కు బుధ‌వారం త‌న ట్వీట్‌లో దొర్లిన త‌ప్పును స‌రిచేస్తూ మ‌రో ట్వీట్ చేసిన జీవీ రెడ్డి.. ఆ విష‌యాన్ని వైసీపీకి చెబుతూ ఇంకో ట్వీట్ చేశారు. త‌న తొలి ట్వీట్‌లో ఓ త‌ప్పు దొర్లింద‌ని, దానిని రెండో ట్వీట్‌లో స‌రిచేశాన‌ని చెప్పిన జీవీ రెడ్డి.. జ‌రిగిన పొర‌పాటుకు 'ఎక్స్‌ట్రీమ్లీ సారీ' అంటూ వైసీపీకి తెలిపారు.

పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌లో ఏపీ దేశంలోనే తొలి స్థానంలో ఉంద‌ని నిన్న‌టి కేంద్రం గ‌ణాంకాల్లో వెల్ల‌డైంద‌ని వైసీపీ చెప్పిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కౌంట‌ర్ ఇచ్చిన జీవీ రెడ్డి... ఆ గ‌ణాంకాల‌ను పూర్తిగా ప‌రిశీలిస్తే తొలి స్థానంలో క‌ర్ణాట‌క‌, రెండో స్థానంలో గుజ‌రాత్ ఉన్నాయ‌ని, ఇందులో ఏపీ సాధించిందేమీ లేద‌ని తేలిందని ట్వీట్ చేశారు. 

ఆ త‌ర్వాత కాసేప‌టికే జ‌రిగిన పొర‌పాటును గుర్తించిన జీవీ రెడ్డి... గ‌తంలో ఆయా సంస్థ‌లు ప్ర‌క‌టించిన పెట్టుబడుల‌ను క‌లుపుకుని మాత్ర‌మే ఏపీ తొలి స్థానంలో నిలిచింద‌ని మ‌రో ట్వీట్ పోస్ట్ చేశారు. ఇదే విష‌యాన్ని తెలుపుతూ వైసీపీకి జీవీ రెడ్డి సారీ చెప్పారు.

More Telugu News