ఏపీ సహా పలు రాష్ట్రాల్లో నేడు అతి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
- దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ
- ఉత్తరాఖండ్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
- పలు ప్రాంతాల్లో రెడ్, ఎల్లో అలెర్ట్ల జారీ
ఉత్తరాఖండ్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మహారాష్ట్రలోని ముంబై, థానే, సింధూదుర్గ్ ప్రాంతాల్లో అధికారులు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. ఇక, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవాతోపాటు ముంబయి, రాయ్గఢ్, రత్నగిరి, థానే, పాల్ఘర్ జిల్లాల్లో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.