వర్షంలో గొడుగు వేసుకోకుండానే రాహుల్ పాదయాత్ర.. కాళ్లు బొబ్బలెక్కినా ఆపేది లేదన్న కాంగ్రెస్ నేత
- ఐక్యత సాధించేందుకు సంకల్పించామన్న రాహుల్
- యాత్రలో తొలి 100 కిలోమీటర్లు పూర్తయిందన్న కాంగ్రెస్ అగ్రనేత
- కల్లంబల్లం వద్ద జరిగిన సభలో బీజేపీపై మండిపాటు
- ఓంశాంతికి బదులు అశాంతి రేకెత్తిస్తోందని ఆగ్రహం
అంతకుముందు ట్విట్టర్, ఫేస్బుక్లో పోస్టులు పెట్టిన రాహుల్.. భారత్ కల చెదిరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దానిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రయత్నం ఇప్పుడే మొదలైందని, తొలి 100 కిలోమీటర్ల యాత్ర పూర్తయిందని అన్నారు. ఐక్యత సాధించేందుకు సంకల్పించామని, ఈ క్రమంలో నడిచినడిచి కాళ్లు బొబ్బలెక్కినా అడుగు ముందుకే వేస్తామని రాహుల్ స్పష్టం చేశారు.