Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits
  • 456 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 134 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతం లాభపడ్డ బజాన్ ఫిన్ సర్వ్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ఐదు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. గత ఆగస్ట్ నెల తర్వాత గరిష్ఠ స్థాయులను తాకాయి. అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ద్రవ్యోల్బంణం పెరిగినట్టు నిన్న గణాంకాలు వెలువడినప్పటికీ... అంతర్జాతీయ సానుకూలతలు మదుపరుల కలవరాన్ని అధిగమించేలా చేశాయి. 

ఈ క్రమంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 456 పాయింట్లు లాభపడి 60,571కి చేరుకుంది. నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 18,070 వద్ద స్థిరపడింది. ఆటో, ఎనర్జీ, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు మినహా అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (4.00%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.48%), భారతి ఎయిర్ టెల్ (2.04%), టైటాన్ (1.68%), బజాజ్ ఫైనాన్స్ (1.56%). 

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-0.37%), ఏసియన్ పెయింట్స్ (-0.29%), టెక్ మహీంద్రా (-0.20%), డాక్టర్ రెడ్డీస్ (-0.15%), సన్ ఫార్మా (-0.07%).
Sensex
Nifty
Stock Market

More Telugu News