లేపాక్షి భూముల వేలాన్ని మళ్లీ నిర్వహించాలని ఎన్సీఎల్టీ చెప్పింది: పయ్యావుల కేశవ్
- లేపాక్షి భూముల వేలాన్ని ఎన్సీఎల్టీ రద్దు చేసిందన్న పయ్యావుల
- వేల కోట్ల విలువ చేసే భూములను రామానుజుల రెడ్డికి తక్కువ ధరకే కట్టబెట్టారని ఆరోపణ
- ఆ తక్కువ మొత్తాన్ని కూడా రామానుజుల రెడ్డి చెల్లించలేకపోయారన్న కేశవ్
- ఇప్పటికైనా పారదర్శకంగా వేలాన్ని నిర్వహించాలని డిమాండ్
ఇంత తక్కువ ధరకు లేపాక్షి భూములను దక్కించుకున్న రామానుజుల రెడ్డి... ఆ మొత్తాన్ని కూడా సకాలంలో చెల్లించలేదని కేశవ్ తెలిపారు. ఈ క్రమంలో గడువులోగా రామానుజుల రెడ్డి వేలం మొత్తాన్ని చెల్లించలేదని తెలిపిన ఎన్సీఎల్టీ... ఆ మొత్తం చెల్లింపునకు మరింత గడువు ఇవ్వలేమని తేల్చిచెప్పిందని ఆయన వెల్లడించారు. ఎన్సీఎల్టీ తీర్పుతో ఇకనైనా లేపాక్షి భూముల వేలాన్ని పారదర్శకంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.