ఎంజే మార్కెట్ ఘటనపై అసోం సీఎం స్పందన ఇదే
- హైదరాబాద్ శోభా యాత్రలో పాల్గొన్న హిమంత బిశ్వ శర్మ
- ఎంజే మార్కెట్ వద్ద ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్త
- అతిథి దేవోభవ సంస్కృతికి విరుద్ధమన్న బిశ్వ శర్మ
శోభా యాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన తనపై హైదరాబాద్లో దాడి యత్నం జరిగిందని హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఓ రాజకీయ పార్టీ కార్యకర్తగా ఉన్న వ్యక్తి ఇలా చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. నిందితుడిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై జరిగిన దాడి యత్నం అతిథి దేవోభవ అనే భారత సంస్కృతికి విరుద్ధం అని ఆయన వ్యాఖ్యానించారు.