బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్ 2తో టీడీపీ మహిళా నేత ప్రతిభా భారతి.. ఇవిగో ఫొటోలు
- 1983లో ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రతిభా భారతి
- అదే ఏడాది నవంబర్లో హైదరాబాద్ వచ్చిన బ్రిటన్ రాణి
- ప్రొటోకాల్ మంత్రి హోదాలో ఎలిజబెత్- 2 వెంటే సాగిన మహిళా నేత
1983లో టీడీపీ తొలిసారి అధికారం చేపట్టగా... నాడు శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిభా భారతికి ఎన్టీఆర్ కేబినెట్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పదవి దక్కింది. అదే ఏడాది నవంబర్లో ఎలిజబెత్- 2 హైదరాబాద్ పర్యటనకు రాగా... ఏపీ ప్రభుత్వం తరఫున ప్రొటోకాల్ మంత్రిగా వ్యవహరించిన ప్రతిభా భారతి... బ్రిటన్ రాణి పర్యటన ఆద్యంతం ఆమె వెంటే సాగారు.