CM Jagan: ఈ నెల 22న కుప్పం వస్తున్న సీఎం జగన్

  • కుప్పంలో సీఎం పర్యటన ఖరారు
  • కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో అభివృద్ధి పనులు
  • శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
  • హెలీప్యాడ్ స్థలాలను పరిశీలించిన పార్టీ నేతలు
CM Jagan will visit Kuppam on September 22

ఏపీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 22న ఆయన కుప్పం రానున్నారు. కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారైనట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం రానుండడంతో ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు హెలీప్యాడ్ కోసం స్థలాలను పరిశీలించారు. 

కాగా, విపక్షనేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోకి సీఎం వస్తుండడంతో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడం తెలిసిందే. 2024 ఎన్నికల్లో కుప్పం స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలన్నది వైసీపీ ప్రణాళికల్లో ముఖ్యమైనదిగా తెలుస్తోంది.

More Telugu News