Girl: నెల్లూరు జిల్లాలో బాలికపై యాసిడ్ దాడి చేసింది మేనమామే: పోలీసులు

  • బాలిక నోట్లో యాసిడ్ పోసి గొంతుకోసిన వ్యక్తి
  • లైంగిక దాడికి యత్నించాడంటూ తొలుత కథనాలు
  • పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాల వెల్లడి
  • డబ్బు కోసం మేనమామ ఘాతుకానికి పాల్పడినట్టు గుర్తింపు
Police says uncle attacks on girl

నెల్లూరు జిల్లాలో ఓ బాలిక నోట్లో యాసిడ్ పోసి, గొంతుకోసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితుడు లైంగిక దాడికి యత్నించగా, ఆమె ప్రతిఘటించడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు తొలుత కథనాలు వచ్చాయి. అయితే, ఈ కేసులో పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 

ఆ 14 ఏళ్ల బాలికపై దాడి చేసింది మేనమామ నాగరాజు అని పోలీసులు వెల్లడించారు. నాగరాజు వ్యసనాలకు బానిసయ్యాడని, డబ్బు కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు. కాగా, బాలికపై అత్యాచారం జరగలేదని, నెల్లూరు రూరల్ డీఎస్పీ హరనాథ్ రెడ్డి వెల్లడించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. మైనర్ బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.

More Telugu News