దేశ రాజకీయాలకు పోదామా...?: నిజామాబాద్ సభలో కేసీఆర్
05-09-2022 Mon 17:11 | Telangana
- నిజామాబాద్ లో కేసీఆర్ పర్యటన.. బహిరంగ సభ
- జాతీయ రాజకీయాల్లో ప్రస్థానం ప్రారంభిస్తున్నామని వెల్లడి
- దేశాన్ని కూడా బాగు చేసుకుంటామని ఉద్ఘాటన

నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. 'పోదామా దేశ రాజకీయాలకు?' అంటూ ప్రజలను అడిగారు. 2024లో బీజేపీ రహిత ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నిజామాబాద్ నుంచి పిలుపునిస్తున్నానని, తెలంగాణ రైతాంగం మాదిరే యావత్ భారతదేశ రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు.
దేశం కోసం తెలంగాణ నుంచే పోరాటం చేయాలని అన్నారు. ఎవరైతే బావుల వద్ద మీటర్ పెట్టాలంటున్నారో, ఎవరైతే రైతులను ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవాలంటున్నారో వారికే మనం మీటర్ పెట్టాలి... అప్పుడే మనం బాగుపడతాం అంటూ ఆవేశపూరితంగా ప్రసంగించారు.
ఉన్నవి అమ్ముకోవడం తప్ప ఈ మోదీ ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? ఒక్క ఫ్యాక్టరీ అయినా పెట్టాడా? అంటూ నిలదీశారు. ఇప్పుడు మోటర్లకు మీటర్లు పెట్టి అన్నీ గుంజుకుంటే మనం శంకరగిరి మాన్యాలు పట్టి కూలిపనులు చేయాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ప్రతి గ్రామంలో రైతు బిడ్డలు, రైతు సంఘాలు సమావేశమై, ఏ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబించినా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో నిరుద్యోగిత పెరిగిపోయిందని, రూపాయి విలువ పడిపోయిందని, ఎవరినీ ఉద్ధరించింది లేదని విమర్శించారు.
దేశం అంతర్జాతీయంగానూ పరువు పోయే పరిస్థితిలో నిలిచిందని అన్నారు. ప్రతిపక్షాలను చీల్చుతూ, రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసుకుంటూ అహంకారంతో, మదంతో ముందుకెళుతున్నారని బీజేపీపై పరోక్షంగా మండిపడ్డారు.
"ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం, నిన్ను దించేస్తాం అంటున్నారు. ఆనాడు నేనొక్కడ్నే... మీరందరూ కలిస్తే సముద్రమై ఉప్పొంగి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు ప్రజాస్వామ్య, లౌకిక భారతదేశం కోసం కొట్లాడాల్సిన సమయం వచ్చింది. మరి దేశ రాజకీయాలను మార్చేందుకు ముందుకు వెళదామా? తెలంగాణను ఏ విధంగా బాగు చేసుకున్నామో, దేశాన్ని కూడా అదే రీతిలో బాగు చేసుకుందాం. ఈ నిజామాబాద్ సాక్షిగా చెబుతున్నా... త్వరలోనే జాతీయ రాజకీయాల్లో ప్రస్థానం ప్రారంభిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో ఎగిరేది బీజేపీయేతర జెండానే" అని కేసీఆర్ స్పష్టం చేశారు.
దేశం కోసం తెలంగాణ నుంచే పోరాటం చేయాలని అన్నారు. ఎవరైతే బావుల వద్ద మీటర్ పెట్టాలంటున్నారో, ఎవరైతే రైతులను ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవాలంటున్నారో వారికే మనం మీటర్ పెట్టాలి... అప్పుడే మనం బాగుపడతాం అంటూ ఆవేశపూరితంగా ప్రసంగించారు.
ఉన్నవి అమ్ముకోవడం తప్ప ఈ మోదీ ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? ఒక్క ఫ్యాక్టరీ అయినా పెట్టాడా? అంటూ నిలదీశారు. ఇప్పుడు మోటర్లకు మీటర్లు పెట్టి అన్నీ గుంజుకుంటే మనం శంకరగిరి మాన్యాలు పట్టి కూలిపనులు చేయాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ప్రతి గ్రామంలో రైతు బిడ్డలు, రైతు సంఘాలు సమావేశమై, ఏ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబించినా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో నిరుద్యోగిత పెరిగిపోయిందని, రూపాయి విలువ పడిపోయిందని, ఎవరినీ ఉద్ధరించింది లేదని విమర్శించారు.
దేశం అంతర్జాతీయంగానూ పరువు పోయే పరిస్థితిలో నిలిచిందని అన్నారు. ప్రతిపక్షాలను చీల్చుతూ, రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసుకుంటూ అహంకారంతో, మదంతో ముందుకెళుతున్నారని బీజేపీపై పరోక్షంగా మండిపడ్డారు.
"ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం, నిన్ను దించేస్తాం అంటున్నారు. ఆనాడు నేనొక్కడ్నే... మీరందరూ కలిస్తే సముద్రమై ఉప్పొంగి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు ప్రజాస్వామ్య, లౌకిక భారతదేశం కోసం కొట్లాడాల్సిన సమయం వచ్చింది. మరి దేశ రాజకీయాలను మార్చేందుకు ముందుకు వెళదామా? తెలంగాణను ఏ విధంగా బాగు చేసుకున్నామో, దేశాన్ని కూడా అదే రీతిలో బాగు చేసుకుందాం. ఈ నిజామాబాద్ సాక్షిగా చెబుతున్నా... త్వరలోనే జాతీయ రాజకీయాల్లో ప్రస్థానం ప్రారంభిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో ఎగిరేది బీజేపీయేతర జెండానే" అని కేసీఆర్ స్పష్టం చేశారు.
Advertisement lz
More Telugu News

5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా
59 seconds ago

కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుసుకుంటే రిస్క్ అంచనా వేయొచ్చు!
3 minutes ago

అలా చేస్తే భారత్ నంబర్ వన్ దేశంగా ఎదుగుతుంది: మంత్రి కేటీఆర్
20 minutes ago

సూసైడ్ బాంబర్ చెకింగ్ ను ఇలా తప్పించుకున్నాడట..!
22 minutes ago

అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
40 minutes ago

ఈ బైక్ ను అందరూ నడపలేరు.. అదే దీని ప్రత్యేకత!
44 minutes ago


శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
1 hour ago

డైరెక్టర్ సాగర్ అంటే మద్రాసులో అంతా భయపడేవారట!
2 hours ago

యువగళం ఏడో రోజు షెడ్యూల్..
2 hours ago

రేపు రిలీజ్ అవుతున్న 'తుపాకుల గూడెం'
3 hours ago

అలాంటి పనులు చేయడం చంద్రబాబుకే అలవాటు: కొడాలి నాని
15 hours ago

నారా లోకేశ్ 6వ రోజు యువగళం పాదయాత్ర.. హైలైట్స్
16 hours ago

కేంద్ర బడ్జెట్ పై చిదంబరం తీవ్ర విమర్శలు
17 hours ago

'శాకుంతలం' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్!
17 hours ago
Advertisement
Video News

Watch: Actress Pooja Hegde's stunning dance at brother's wedding
11 minutes ago
Advertisement 36

Pawan Kalyan in 'Unstoppable with NBK S2': Action, Style, and Attitude
23 minutes ago

Flight-shaped drone caught in fishermen's net in Srikakulam
39 minutes ago

Director Trivikram plays cricket on SSMB 28 set, video goes viral
53 minutes ago

Brahmanandam's heart touching performance in Rangamarthanda, brings tears
1 hour ago

LIVE : YS Sharmila Press Meet
1 hour ago

Experts predict significant increase in gold prices
1 hour ago

Gautam Adani: No impact on operations despite FPO withdrawal
2 hours ago

Tollywood stars Nagarjuna, Pooja Hegde create buzz with new ad
2 hours ago

Tollywood senior director passes away
3 hours ago

Major fire breaks out at Chikkadpally godown in Hyderabad
3 hours ago

LIVE : Nara Lokesh's Yuvagalam Padayatra Day-7
3 hours ago

7 AM Telugu News: 2nd February 2023
4 hours ago

TDP leader Balakotireddy attacked in Andhra Pradesh's Palnadu district
5 hours ago

Megastar Chiranjeevi visits Brahmanandam on his birthday, viral video
5 hours ago

Telangana Finance Minister Harish Rao calls Union Budget as anti-farmer and anti-poor
6 hours ago