అన్నం తినేవారెవ్వరూ అన్నా క్యాంటీన్ను అడ్డుకోరు: నారా లోకేశ్
- తెనాలిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటును అడ్డుకున్న పోలీసులు
- సీఎం జగన్కు మానవత్వమే లేదా? అని లోకేశ్ ప్రశ్న
- ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి తీరతామని వెల్లడి
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసలు మానవత్వమే లేదా? అని కూడా నారా లోకేశ్ ప్రశ్నించారు. తెనాలిలో కేవలం అన్నా క్యాంటీన్ను అడ్డుకునేందుకే పోలీసు పహారా పెట్టడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి తీరతామని ఆయన స్పష్టం చేశారు. అన్నా క్యాంటీన్లతో రాష్ట్రంలోని నిరుపేదల ఆకలి తీరుస్తామని కూడా ఆయన చెప్పారు.