సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు రాష్ట్రాల్లోకి చొరబడటం సరికాదు: కేసీఆర్
- శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమన్న కేసీఆర్
- సీబీఐ ఎంట్రీని అడ్డుకున్న బీహార్ను అభినందించిన తెలంగాణ సీఎం
- అన్ని రాష్ట్రాలు అదే పనిచేయాలని పిలుపు
ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని నరేంద్ర మోదీ సర్కారు ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై దాడులకు తెగబడుతోందని ఆయన విమర్శించారు. శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమని కేసీఆర్ చెప్పుకొచ్చారు. సీబీఐ ప్రవేశాన్ని నిరాకరిస్తూ బీహార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్న కేసీఆర్.. మిగిలిన అన్ని రాష్ట్రాలు ఇదే పని చేయాలని పిలుపునిచ్చారు.