Jacqueline Fernandez: బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

  • సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్‌పై రూ.200 కోట్ల మ‌నీ ల్యాండ‌రింగ్ కేసు
  • ఈ కేసులోనే జాక్వెలిన్ పేరును చేర్చిన ఈడీ
  • ఈ నెల 26న విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ ఢిల్లీ హైకోర్టు నోటీసులు
delhi high court summons actress Jacqueline Fernandez

బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కేసులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌ల‌పై జాక్వెలిన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఇప్ప‌టికే కేసులు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా ఢిల్లీ హైకోర్టు నుంచి జాక్వెలిన్‌కు బుధ‌వారం నోటీసులు జారీ అయ్యాయి. 

మ‌నీ ల్యాండ‌రింగ్ కేసు విచార‌ణ‌లో భాగంగా ఈ నెల 26న త‌మ ముందు హాజ‌రు కావాలంటూ ఢిల్లీ హైకోర్టు జాక్వెలిన్‌కు నోటీసులు జారీ చేసింది. సుఖేశ్ చంద్రశేఖర్‌పై న‌మోదైన రూ.200 కోట్ల‌ మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో జాక్వెలిన్ పేరును చేరుస్తూ ఈడీ గ‌తంలోనే కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగానే ఆమెకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

More Telugu News