ఐర్లాండ్ లో ఇద్దరు కేరళ బాలుర దుర్మరణం
- స్నేహితులతో పిక్నిక్ కు వెళ్లిన వైనం
- ఈత కొట్టేందుకు సరస్సులో దిగిన విద్యార్థులు
- ఈత రాక నీటమునిగిన బాలురు
- ఇద్దరు మృతి
- మరో నలుగురిని కాపాడిన పోలీసులు
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మునిగిపోయిన బాలురను బయటికి తీశారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో మరణించగా, మరొకరు సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. మరో నలుగురిని పోలీసులు కాపాడారు. ఈ విద్యార్థులు స్థానిక గ్రామర్ హైస్కూల్లో చదువుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో ఉత్తర ఐర్లాండ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.