Panja Vaisshnav Tej: 'రంగ రంగ వైభవంగా' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్!

  • ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'రంగ రంగ వైభవంగా'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్  
  • ఇంతవరకూ వదిలిన పాటలకు మంచి రెస్పాన్స్  
  • వచ్చేనెల 2వ తేదీన సినిమా విడుదల    
Ranga Ranga Vaibhavanga song released

వైష్ణవ్ తేజ్ - కేతిక శర్మ జంటగా నటించిన 'రంగ రంగ వైభవంగా' సినిమా, వచ్చేనెల 2వ తేదీన భారీస్థాయిలో థియేటర్లలో దిగిపోనుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, గిరీశాయ దర్శకత్వం వహించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి బాణీలను సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను రిలీజ్ చేశారు. 

'సిరి సిరి సిరి మువ్వల్లోనే  ..' అంటూ ఈ పాట సాగుతోంది. హీరోహీరోయిన్లపై ఈ పాటను అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. జావేద్ అలీ .. శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట, సాహిత్యం పరంగా కూడా ఆకట్టుకునేలా ఉంది. ప్రేమలో పడిన నాయకా నాయికలు తమదైన లోకంలో విహరించే నేపథ్యంలో వచ్చే పాటగా ఇది కనిపిస్తోంది. 

ఇప్పటికే ఈ సినిమా  నుంచి వదిలిన 'తెలుసా .. తెలుసా' .. 'కొత్తగా లేదేంటి' పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వదిలిన ఈ సాంగ్ కూడా యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. కెరియర్ పరంగా హీరో .. హీరోయిన్ ఇద్దరికీ కూడా ఇది మూడో సినిమానే. ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.

More Telugu News