Sensex: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటనతో కుప్పకూలిన మార్కెట్లు

  • కీలక వడ్డీ రేట్లను పెంచుతామన్న ఫెడరల్ రిజర్వ్
  • 861 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 246 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని, వడ్డీ రేట్ల పెంపు తప్పదని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో వారు అమ్మకాలకు మొగ్గుచూపారు. 

ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 861 పాయింట్లు కోల్పోయి 57,972కి పడిపోయింది. నిఫ్టీ 246 పాయింట్లు నష్టపోయి 17,312కి దిగజారింది. ముఖ్యంగా ఐటీ స్టాకులు భారీగా పతనమయ్యాయి. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (1.30%), ఏసియన్ పెయింట్స్ (0.61%), నెస్లే ఇండియా (0.52%), ఐటీసీ (0.24%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.20%). 

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-4.57%), ఇన్ఫోసిస్ (-3.93%), విప్రో (-3.06%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.98%), టీసీఎస్ (-2.73%).

More Telugu News