ఎఫ్ఆర్ బీఎం నిబంధనలను జగన్ లెక్కచేయడంలేదు: యనమల
- ఏపీ ప్రభుత్వంపై యనమల ధ్వజం
- అత్యధిక చేబదుళ్లు తీసుకున్న ప్రభుత్వం ఇదేనని విమర్శలు
- జగన్ రాజ్యాంగాన్ని కూడా లెక్కచేయడంలేదని వెల్లడి
వేజ్ అండ్ మీన్స్ తో రూ.1.04 లక్షల కోట్ల నిధులు, ఓడీ కింద రూ.31 వేల కోట్ల నిధులు తెచ్చారని, ఆ నిధులకు లెక్కలు చెప్పడంలేదని ఆరోపించారు. ట్రెజరీ కోడ్ ను ఉల్లంఘించి ప్రత్యేక బిల్లుల రూపంలో తనకు కావాల్సిన వారికోసం రూ.48,284.32 కోట్లు దోచిపెట్టారని యనమల వెల్లడించారు. దీన్ని కప్పిపుచ్చేందుకు జీవో-80 తీసుకువచ్చారని ఆరోపించారు. సీఎఫ్ఎంఎస్ ను బైపాస్ చేస్తూ బిల్లులు చెల్లిస్తున్నారని వివరించారు.