ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన సీబీఐ
- ఎక్సైజ్ స్కామ్ కేసులో జారీ చేసిన సీబీఐ
- ఇదేం డ్రామా? అని మోదీని ప్రశ్నించిన సిసోడియా
- తాను ఢిల్లీలోనే ఉన్నానని, ఎక్కడికి రావాలో చెప్పాలంటూ ట్వీట్
ఈ నోటీసుపై మనీశ్ సిసోడియా స్పందిస్తూ.. ‘ఇదేం డ్రామా’ అంటూ ప్రధాని మోదీపై మండిపడ్డారు.‘మీ దాడులన్నీ అయిపోయాయి. ఏమీ దొరకలేదు. ఒక్క పైసా కూడా లభించలేదు. ఇప్పుడు మనీశ్ సిసోడియా అందుబాటులో లేరని లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. ఏంటి మోదీజీ ఈ జిమ్మిక్కు?. నేను ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నాను, ఎక్కడికి రావాలో చెప్పండి. మీరెక్కడున్నారో నాకు కనిపించడం లేదు’ అని ట్వీట్ చేశారు.