జింబాబ్వేతో రెండో వన్డే.. విజయానికి చేరువలో ఇండియా
- హరారేలో జరుగుతున్న రెండో వన్డే
- 161 పరుగులకు జింబాబ్వేను కుప్పకూల్చిన భారత బౌలర్లు
- విజయానికి 46 పరుగుల దూరంలో భారత్
అనంతరం 162 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన శుభ్ మన్ గిల్ మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తో కలిసి ఇన్నింగ్స్ ను నిర్మించాడు. ఇద్దరూ కూడా చెరో 33 పరుగుల వంతున చేసి అవుటయ్యారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు. సంజు శాంసన్ 9 పరుగులతో, దీపక్ హుడా 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇండియా విజయం సాధించడానికి మరో 46 పరుగులు అవసరం.