పవన్ కడప పర్యటనలో అపశ్రుతి... కాన్వాయ్ వాహనాలు ఢీకొని 10 మందికి గాయాలు
- కడప ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా పయనం
- మలినేనిపట్నం వద్ద ఢీకొన్న వాహనాలు
- క్షతగాత్రులు కడప రిమ్స్కు తరలింపు
సాగు కలిసి రాక ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసే నిమిత్తం జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పేరిట భారీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమం కింద పలు జిల్లాల్లో పర్యటించిన పవన్.. శనివారం ఉమ్మడి కడప జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని సిద్ధవటంలో రచ్చబండ కార్యక్రమంలో బాధిత కుటుంబాలతో మాట్లాడనున్నారు. అదే సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న రౌలు రైతుల కుటుంబాలకు ఆయన రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.