నన్ను చాలా మంది కమిట్మెంట్ అడిగారు: టాలీవుడ్ నటి తేజస్వి మదివాడ
- ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది పచ్చి నిజమన్న తేజస్వి
- తాను చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని వ్యాఖ్య
- ఈవెంట్లకు వెళ్లినప్పుడు చుట్టూ చేరి వేధించేవారని వెల్లడి
సినీ పరిశ్రమలో కమిట్మెంట్ అడుగుతారనేది పచ్చి నిజమని చెప్పింది. తనను కూడా ఎంతో మంది కమిట్మెంట్ అడిగారని తెలిపింది. ప్రతి రంగంలో ఇలాంటివి ఉంటాయని... వారికి లొంగిపోకుండా, ధైర్యంగా ఉండాలని చెప్పింది. అలాంటి వాళ్లకు లొంగిపోయి ఆ తర్వాత మోసపోయాం అని చెప్పడం సరైంది కాదని తెలిపింది. తాను సినిమాలు చేస్తూనే ఈవెంట్లకు వెళ్లేదాన్నని... ఈవెంట్లకు వెళ్లినప్పుడు జనాలు ఫుల్లుగా తాగి తన చుట్టూ చేరి వేధించేవారని... వారి నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడేదాన్నని చెప్పింది.