ముంబై ఫొటో ఎగ్జిబిషన్కు ఎంపికైన ఏపీ మంత్రి రోజా ఫొటో ఇదే!
- ఇటీవలే విజయవాడలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పతాకంతో రోజా
- ఫొటోగ్రఫీ దినోత్సవాన ముంబైలో ఫొటో ఎగ్జిబిషన్
- 75 ఫొటోల్లో రోజా ఫొటో కూడా ఒకటిగా ప్రదర్శించిన వైనం
- సంతోషం వ్యక్తం చేసిన ఏపీ పర్యాటక శాఖ మంత్రి
ఈ ఎగ్జిబిషన్లో ఏపీకి చెందిన ఓ ఫొటో కూడా ప్రదర్శితమైంది. అది ఓ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫరే తీసినా... అందులో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పతాకాన్ని పట్టుకున్న ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఉన్నారు. వేదిక చుట్టూ వందలాది మంది ఫొటోగ్రాఫర్లు కెమెరాలతో క్లిక్ మనిపిస్తుండగా.. వేదికపై ఆమె ఒక్కరే ఆ జెండాను రెపరెపలాడిస్తూ కనిపిస్తున్నారు. ఈ ఫొటో ముంబై ఫొటో ఎగ్జిబిషన్కు ఎంపికైనందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందంటూ రోజా ఆనందం వ్యక్తం చేశారు.