'జగన్ రోడ్లు- నరకానికి దారులు'.. ఏపీ రోడ్లపై బీజేపీ ప్రచారం షురూ
- ఏపీలో రోడ్ల దుస్థితిపై టీడీపీ, జనసేన ప్రచారం
- తాజాగా ఆ బాధ్యతను తీసుకున్న బీజేపీ
- సోషల్ మీడియా వేదికగా కార్టూన్లతో ప్రచారం మొదలెట్టిన కమలనాథులు
శుక్రవారం సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఓ సెటైరికల్ కార్టూన్ను సంధించింది. 'జగన్ రోడ్లు- నరకానికి దారులు' పేరిట మొదలుపెట్టిన ఈ ప్రచారంలో భాగంగా 'వైసీపీ ప్రభుత్వ సిత్రాలు... రాష్ట్ర రోడ్లు' అంటూ ఓ కార్టూన్ను పోస్ట్ చేసింది. ఈ కార్టూన్ లో విజయవాడకు 5 కిలో మీటర్ల దూరంలో కారులో వెళుతున్న ఓ వ్యక్తి.. రోడ్డు పక్కగా కూర్చుని మద్యం తాగుతున్న ఓ వ్యక్తిని 'ఈ రోడ్డు ఎక్కడికి వెళుతుంది' అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా... 'ఏముంది? డైరెక్ట్గా పైకే' అంటూ సమాధానం ఇస్తాడు. అంతేకాకుండా 'ఈ రోడ్డు ఎక్కడికి పోతుందో తెలియదు గానీ... నీ కారేమో షెడ్డుకు, నువ్వేమో హాస్పిటల్కి మాత్రం పక్కాగా వెళతారు' అంటూ సెటైర్ సంధిస్తాడు.