రేపు కడప జిల్లాకు జనసేనాని... సిద్ధవటంలో రచ్చబండ నిర్వహించనున్న పవన్
- ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు జనసేన ఆసరా
- బాధిత కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున సాయం
- చెక్కులను స్వయంగా అందజేయనున్న పవన్ కల్యాణ్
ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని సిద్ధవటం గ్రామంలో పవన్ కల్యాణ్ రచ్చబండ పేరిట రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. రచ్చబండలోనే ఆయన పలువురు రైతుల కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున సహాయం అందించనున్నారు. జిల్లా పరిధిలో ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలన్నింటికీ పవన్ ఈ సాయాన్ని చేరవేయనున్నారు.