మళ్లీ 10 వేలు దాటిన కరోనా కేసులు
- గత 24 గంటల్లో 12,608 పాజిటివ్ కేసులు
- మొన్నటికంటే మూడు వేల కేసుల పెరుగుదల
- ఒక్క రోజులోనే 72 మంది మృతి
ప్రస్తుతం దేశంలో 1,01,343 క్రియాశీల కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.23 శాతంగా ఉండగా.. పాజిటివిటీ రేటు 3.48 శాతంగా నమోదైంది. రికవరీ రేటు మాత్రం 98.50 శాతంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటిదాకా 208 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు అందజేశారు. నిన్న ఒక్కరోజే 38.64 లక్షల మంది టీకాలు తీసుకున్నారు.