ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు దగ్ధం అవుతున్నాయో గుర్తించిన నిపుణుల కమిటీ
- ఇటీవల ఎలక్ట్రిక్ బైకుల్లో అగ్ని ప్రమాదాలు
- చార్జింగ్ పెడుతుండగా మంటలు
- ప్రాణాలు కోల్పోయిన పలువురు వ్యక్తులు
- నివేదిక రూపొందించిన నిపుణుల కమిటీ
తాజాగా నిపుణుల కమిటీ అధ్యయనం జరిపి ఓ నివేదిక రూపొందించింది. చాలా ప్రమాదాలు బ్యాటరీలో లోపాలు, షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగాయని కమిటీ గుర్తించింది. సెల్ఫ్ వెంటింగ్ మెకానిజంలో తీవ్రస్థాయి లోపాలు ఉన్న విషయాన్ని గమనించింది. అంతేకాదు, నాణ్యత లేని వాహనాలు విక్రయించాయంటూ మూడు కంపెనీలపై భారీ జరిమానా విధించాలని ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.